* టీటీడీ చైర్మన్గా కనుమూరి బాపిరాజు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజును ప్రభుత్వం నియమించింది. బాపిరాజు ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన దేవాదాయ, వాణిజ్య, ఎకై్సజ్ శాఖల మంత్రిగా పని చేశారు.
ఎంపిక విషయం తెలిసిన వెంటనే ఆయన సాయిబాబా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడుతానని ఆయన చెప్పారు.